CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్..

Share it:


జూలూరుపాడు ఆగస్టు 30, (మన్యం మనుగడ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరి చేసిన ఆసరా పెన్షన్ కార్డులను మంగళవారం మండల కేంద్రంలోని పడమట నర్సాపురం గ్రామ పంచాయతీలో రైతు వేదిక నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెందుతుందని అన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆదరించాలని కోరారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా 1024 మంది నూతన లబ్ధిదారులు ఎంపికయ్యారని, వచ్చేనెల  నుండి వీరి ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్రం మోహన్ రావు, ఎంపీపీ లావుడ్యా సోనీ, జడ్పిటిసి భూక్య కళావతి, పిఎసిఎస్ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీలు కాజా విజయరాణి, పొన్నెకంటి సతీష్ కుమార్, పెండ్యాల రాజశేఖర్, దుద్దుకూరి మధుసూదన్ రావు, సర్పంచులు ధారావత్ రోజా, బానోత్ శాంతి లాల్, గుగులోత్ రాందాస్, లావుడ్యా కిషన్ లాల్, పార్టీ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, లాకావత్ గిరిబాబు, రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, మండల పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, కార్యదర్శి నున్న రంగారావు, ఎండిఓ రవి, ఎంపీఓ రామారావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: