దమ్మపేట ఆగస్టు 09 ( మన్యం మనుగడ ) : శబరి,గోదావరి వరద బాధితులు ధర్మా తాళ్లగూడెం నూతిగూడెం తాళ్ల గొమ్మూరు గ్రామాలకు నాలుగు వందల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన సత్తుపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు రాజారావు స్వగ్రామం చింతూరు మండలం కారం గూడెం ఇటీవల శబరి,గోదావరి వరదలకు సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాకు తన వంతుగా నిత్యావసర సరుకులు ఇవ్వాలని నిర్ణయించుకున్న రాజారావు తన మిత్రుల సహకారం తో గత కొన్ని రోజులుగా చింతూరు మండల లో కారం గూడెం,ముకునురు, బండారు గూడెం,కోడెరు వరద బదితులకీ నిత్యావసర సరుకులు పంచారు. వీఆర్ పురం మండలం రామవరం,జల్లివారిగూడెం గ్రామాలలో పంచారు ఈ రోజు నూతిగూడెం,ధర్మా తాళ్లగూడెం గ్రామాలకు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యులు ముత్యాల శ్రీనివాసరావు, ఎటపక డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిషన్ సభ్యులు చిక్కాల బాలు,అరకుంపర్లమెంట్ కార్యదర్శి బొడ్డు సత్యనారాయణ,రాజారావు మిత్రులు కొర్ష వెంకటేష్ దొర, ఇర్ప కృష్ణ రావు,కలపాల శ్రీను, బట్ట ప్రసాద్ సున్నం తిరుపతి రావు రాయల నాగేశ్వరరావు కురం బుచ్చిబాబు పాయం బుల్లిబాబు వడ్డిగూడెం సర్పంచ్ సోడి నర్సమ్మ,సుమన్,సున్నం రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: