మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : మండల కేంద్రమైన చండ్రుగొండలో నూతనంగా నిర్మించిన సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని వేద పండితులు వివిఆర్ కే మూర్తి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆలయ నిర్మాణానికి, అన్నదాన కార్యక్రమానికి గ్రామంలోని భక్తులు సహకరించారని, వారి సహకారం మరువలేనిదన్నారు. అన్నదాన కార్యక్రమం వారం వారం నిర్వహించాలని ఆలయ భక్త కమిటీలు నిర్ణయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు పెద్దిని వేణు, రాయల రమేష్, మక్కా రమేష్, సోమనపల్లి వెంకటేశ్వర్లు, వేముల నాగేశ్వరరావు,కుక్కడపు హరిబాబు, కడియాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: