మన్యం టీవీ దుమ్ముగూడెం ::
భద్రాచలం ఎక్సైజ్ శాఖ హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామంలో గీత కార్మికులకు తాటి ఈత వృక్షాల గింజలను సీఐ ఎస్.కె రహి మున్ని బేగం పంపిణీ చేశారు అనంతరం గీత కార్మికులతో కలిసి గింజలను నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో గింజలు పంపిణీ చేస్తున్నామని తాటి ఈత వృక్షల సురపానం వలన క్యాన్సర్ తదితర వ్యాధులు నివారణకు ఉపయోగపడుతుందని అలానే భావితరాల భవిష్యత్తులో వారి వృత్తిని మర్చిపోకూడదని చెప్పారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అలీమ్ నరేందర్ కానిస్టేబుల్ వీరబాబు స్రవంతి గీత కార్మికులు వెంకన్న గౌడ్ వీరన్న గౌడ్ పానుగంటి వెంకన్న గౌడ్ మురళిగౌడ్ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: