మన్యం మనుగడ కరకగూడెం : మండల వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుకోని ప్రభుత్వ ప్రవేటు, పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, యువకుల సంఘాల బాద్యులు, పాత్రికేయులు, జాతీయ జెండాలు ఆవిష్కరించారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రేగా కాళిక, తాసిల్దార్ కార్యాలయంలో తహశీల్దారు ఉషశారద,పోలీస్ స్టేషను లో ఎస్ఐ నాగ బిక్షం, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డాక్టర్ పర్షియా నాయక్, కరకగూడెం మండల వ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతి కార్యాలయాలలో సర్పంచ్ లు ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయులు జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే దేశానికీ స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.
Post A Comment: