మన్యం మనుగడ, పినపాక:
జీఎస్ఎస్ ఖమ్మం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పినపాక మండలం పోతురెడ్డి పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లను, నోట్ పుస్తకాలు , పెన్నులు అందజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుతున్న పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ వస్తువులను అందజేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమం లో జిఎస్ఎస్ ప్రెసిడెంట్ యం. జాకబ్, ఇన్చార్జి ప్రెసిడెంట్ రామారావు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి లక్ష్మణ్, సిబ్బంది రామ్మోహన్, సాంబమూర్తి, అనిత, సాంబశివరావు, పూర్ణచంద్రరావు, టి సాంబశివరావు, విజయనిర్మల పాల్గొన్నారు.
Post A Comment: