మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : నాయి బ్రాహ్మణ మండల సమావేశంలో నాయి బ్రాహ్మణ మండల అధ్యక్షుడు కొల్లిపాక అప్పారావు మాట్లాడుతూ... నాయి బ్రాహ్మణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన వారిపై శిక్షించే విధంగా జీవో జారీ చేయాలన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా మంగళోడా, మంగళది, బొచ్చుగిక్కునేవాడా, అని కించపరిచే విధంగా మాట్లాడితే వారిపై శిక్షించే విధంగా జీవో జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడిన వారిపై శిక్షించే విధంగా జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ రాష్ట్ర కార్యదర్శి దడగల మల్లేష్, రాచకొండ నాగేశ్వరరావు, చిన్న, వెంకట్,అద్దంకి పవన్, కడియాల సురేష్,తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: