మన్యం మనుగడ, మంగపేట.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆజాదికా అమృత్ మహోత్సవ్ పేరుతో జాతీయ పండుగ సంబురాలు నిర్వహించుకుంటున్నాం.వజ్రోత్సవాల్లో బాగంగా మంగళవారం 16/08/20022, సమయం 11:30 నిముషాలకు సామూహిక జాతీయ గీతాలాపన లో మంగపేట మండలం రాజుపేట గ్రామం లో విద్యార్థులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయ్యినిలు, అంగన్వాడీ టీచర్స్, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, గ్రామస్తులు, చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సామూహిక జాతీయ గీతాలాపన లో పాల్గొన్నారు. రోడ్డు మీద వెళ్లేవారు సైతం అక్కడికక్కడే నిలబడి జాతీయ గీతం ఆలపించటం జరిగింది. పల్లెల్లో సైతం పెల్లుబికిన దేశ భక్తి, ఉప్పొంగిన జాతీయ వాదం చూస్తుంటే దేశానికి మరల పూర్వ వైభవం వస్తుంది, ప్రజల్లో గుండెల నిండా దేశ భక్తి నిండి స్వార్ధపూరిత రాజకీయాలు మాని ప్రతి ఒక్కరూ నిస్వార్థంగాతమ తమ రంగాల్లో పని చేసి ఉజ్వల భారతాన్ని నిర్మిస్తారని ప్రజలు ఆశించారు.
Post A Comment: