మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 16. మండల కేంద్రంలో విష జ్యరాలు విజృంభించాయి,తాజాగా పెనుగోలు కాలనీ లో విష జ్వరాలతో 9 కుటుంబాలు మంచానికే పరిమితమై, ఆరోగ్యాన్ని సర్వం కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది, పనికి వెళ్తేనే పట్టెడన్నం దొరికే పరిస్థితి లో ఉన్నా ఆ ఊరి ప్రజల జీవన విధానం ఉంది. బ్రతుకు జీవుడా అంటూ బ్రతుకు కొరకు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆదివాసి గ్రామాలలో పరిశుభ్రత, లోపించడం వల్ల దోమలు, ఈగలు,తో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని గ్రామ ప్రజల ఆరోపిస్తున్నారు. ఎగువనా కురిసిన వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతమైన పెనుగోలు కాలనీ గ్రామ చుట్టూ నీరు ఉంటుంది కాబట్టి దోమలు, ఈగలు రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. గ్రామపంచాయతీ తక్షణమే చర్య తీసుకోవాలని, స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
Post A Comment: