మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని గోదావరి వరదల వల్ల పరివాహ ప్రాంతాలైన అనేక ఎకరాలలో పంటలు నష్టపోయినటువంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వానకన సీజన్లో రైతులకు న్యాయమైన విత్తనాలు ఎరువులు పంపిణీ చేయాలని రైతు సంఘం జిల్లా నాయకులు బుల్లి సూర్యచంద్రరావు యలమంచి శ్రీనుబాబు డిమాండ్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మండలంలోని ప్రత్తి పంటను వరదలకు ముందే రైతన్న వేశారని వరదల వల్ల పత్తి పంటకు మొత్తం పూర్తిగా దెబ్బతినిందని అలానే అనేక సంవత్సరాలుగా పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతాంగం కూడా పూర్తిగా నష్టపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు లోకేష్ బాబు వంశీ బుల్లి సత్యనారాయణ సాయిబాబు కుమ్మరికుంట సాంబశివరావు చలకాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: