మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ దుమ్ముగూడెం స్కూల్ నందు జరుగుతున్న ఉపాధ్యాయుల తొలిమెట్టు శిక్షణ కేంద్రాలను అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ నాగరాజు శేఖర్ సందర్శించారు. మొదటి వ్యక్తులు జరుగుతున్న 60 మంది ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం ఈనెల 15 నుండి అన్ని పాఠశాలలో అమలు చేస్తున్నామని తెలిపారు. అన్ని తరువుతుల విద్యార్థుల యొక్క అభ్యసనము సామర్థతను పెంపొందించాలని ఉపాధ్యాయులందరూ వెనుకబడిన విద్యార్థుల పాఠ్యాంశాలను గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శంకర్, రిసోర్స్ పర్సన్స్ ప్రభాకర్ శ్రీనివాస్ రత్నాకర్ మధు అరుణకుమారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Post A Comment: