CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీలకు విద్యుత్ శాఖ ఏఈ రఘురామయ్య సూచన..

Share it:


జూలూరుపాడు ఆగస్టు 27, (మన్యం మనుగడ ప్రతినిధి) ఈనెల 31న వినాయక చవితి సందర్భంగా మండల వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులకు గణపతి మండపాలలో విద్యుత్ వాడకంపై పలు రకాల సూచనలు చేశారు. మండపాలలో విద్యుత్ వాడుకొనుటకు విద్యుత్ శాఖ పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో మండపాలను విద్యుత్ లైన్లు కింద ఏర్పాటు చేయవద్దని, మండపాలలో లోడుకు సరిపడా గేజ్ వైర్లు వాడాలని, సాధ్యమైనంత వరకు అతుకులు లేకుండా చూసుకోవాలని, పిల్లలకు అందనంత ఎత్తులో వైర్లు ఉండేలా చూసుకోవాలని, ఎల్ఈడి బల్బులు మాత్రమే వాడాలని అన్నారు. మండపాలలో ఫ్యూజ్ బాక్స్, ఎర్త్ పైపును ఏర్పాటు చేసుకోవాలని, అనుభవం కలిగిన ఎలక్ట్రిషన్ ద్వారా వైరింగ్ చేయించుకోవాలని కోరారు. మండపాలకు విద్యుత్ శాఖ సిబ్బంది ద్వారానే కనెక్షన్ తీసుకోవాలని అన్నారు. ఏ కారణం చేతనైనా ఏదైనా విద్యుత్ సంబంధిత ప్రమాదం జరిగినచో పూర్తి బాధ్యత కమిటీ వారిదేనని తెలియజేశారు. అనుమతులు లేకుండా విద్యుత్ లైన్ కు వైర్లు తగిలిస్తే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జూలూరుపాడు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రఘురామయ్య తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: