CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ.

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలోని 75వ స్వాతంత్రియ వజ్రోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం రాఖీ పౌర్ణిమి సందర్భంగా బీసీ గురుకులం పాఠశాలను సందర్శించి వజ్రోత్సవ వేడుకలలో పాల్గొన్న అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిరుపేదల చదువు కోసం గురుకులంలో ఒక్కో విద్యార్థికి గాను 119000 రూపాయలను ఖర్చు చేస్తుందని, అలాగే రాఖీ పౌర్ణమి సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను, రాఖీ పౌర్ణమి ని పురస్కరించుకొని ఈ నెల ఆగస్ట్ 15 వా తారీకు నుండి వృద్ధులకు, వికలాంగులకు, సుమారు 10 లక్షల మందికి పింఛన్లు ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నా సందర్భంగ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ చల్ల అరుణ, ఉపాధ్యాయురాలు, ఎంపీపీ కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ విద్యాధర రావు, సాయి కిషోర్, ఈఓ హరికృష్ణ, శ్రీరామమూర్తి, మండల నాయకులు మోహన్ రెడ్డి, తాడేపల్లి రవి, యూఎస్ ప్రకాష్, కలపాల శ్రీను, శెట్టిపల్లి రఘురాం, అశ్వారావుపేట తెరాస పార్టి టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ, పవన్ కళ్యాణ్ సేవాసమితి అధ్యక్షులు డెగల రాము, నార్లపాటి రాములు, గంధం వేంకటేశ్వర రావు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: