మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:
కులమతాల తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు స్నేహ భావంతో మెలగాలని సబ్ ఇన్స్ స్పెక్టర్ గొల్లపల్లి విజయలక్ష్మి అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫ్రెండ్లీ పోలిస్ లో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సబ్ ఇన్స్ స్పెక్టర్ గొల్లపల్లి విజయలక్ష్మి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ... కులమతాల భేదం లేకుండా అందరూ స్నేహభావంతో ఐక్యతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామిశెట్టి సైదయ్య, ప్రధాన కార్యదర్శి వెలగల మధు, ఉపాధ్యక్షులు ఎస్కే జాఫర్, ప్రెస్ క్లబ్ సభ్యులు బొగ్గుల శివ నాగిరెడ్డి, కుంజా వెంకటేష్, సయ్యద్ నూరే రబ్బాని, తాళ్లూరి రామదాసు, సోమనపల్లి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: