మన్యం మునగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామపంచాయతీలో నెల్లిపాక,నెల్లిపాక బంజార,టేకులగుట్ట గ్రామాలకు గోదావరి వరద ముంపు ప్రాంత బాధితులకు అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జాలే రామకృష్ణారెడ్డి తన వంతు బాధితులకు విరాళంగా ప్రతి కుటుంబానికి 500 వందల రూపాయలు చొప్పున 200 కుటుంబాలకు 1 లక్ష రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్,స్థానిక సర్పంచ్,ఎంపీటీసీ గొర్రెముచ్చు వెంకటరమణ,గాదె జయ,సీనియర్ నాయకులు ఈదరా సత్యనారాయణ కందుల కృష్ణార్జున రావు,చిలక వెంకటరమయ్య,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు కందుల దుర్గ భవాని,తుమ్మలచెరువు ఎంపీటీసీ తాటి పూజిత,నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ ,మండల ఎస్సీసెల్ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ,మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ ,జిల్లా మాలమహానాడు నాయకులు మేకల భాస్కర్,కాలవ సంసన్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: