CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో హరితహారం.మురికి కాలువలలో లార్వా చేరకుండా చర్యలు

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రోహిబీషన్ అండ్ ఎక్సైజ్ శాఖవారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో కర్బూజ మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ, హరితహారం పేరుతో ప్రకృతి మొత్తం పచ్చదనాన్ని కలిగి ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేశారు.


అదేవిధంగా భారీ వర్షాల కారణంగా పినపాక గ్రామంలో మురికికుంటలలో, లార్వా అభివృద్ధి చెందకుండా గంబుషియా చేపలను వేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వలన ఈ చేపలు దోమల ద్వారా అభివృద్ధి అయ్యే లార్వాను తినేస్తాయని, ఈ కారణంగా దోమల సంతతి తగ్గుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఎంపీటీసీ చింతపంటి సత్యం, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


Share it:

TS

Post A Comment: