CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దోస్త్ లో మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశేష స్పందన.దోస్త్ క్యాంపెయిన్ ను నిర్వహించిన మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్..

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు పట్ల విద్యార్థులు,ఆకర్షితులవుతున్నారని అశ్వాపురం, పినపాక, మణుగూరు ప్రాంతాలకు సంబంధించిన ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు చేరడానికి ఆసక్తి కనపరుస్తూ దోస్తు నందు మొదటి ఆప్షన్ గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు ఎన్నుకోవడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ తెలియజేశారు. అశ్వాపురం మండలంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ ను 20 మంది విద్యార్థులు కలిసి తామంతా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు మొదటి ఆప్షన్ గా దోస్తు నందు నమోదు చేసుకున్నామని తెలియజేశారు. విద్యార్థుల స్పందన పట్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హర్షం వ్యక్తం చేశారు. ఇతర విద్యార్థులకు దోస్తు నందు నమోదు చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కళాశాల ప్రిన్సిపల్ వివరించారు ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు తమ అడ్మిషన్ సమయంలో జరిగిన తప్పుల వల్ల దోస్త్ ఆప్షన్ ఇవ్వడం ఇబ్బంది జరుగుతుందని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి వారి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడంతో విద్యార్థులు హర్షంధ్వానాల ద్వారా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ ను అభినందించడం జరిగింది. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని కళాశాలకు విచ్చేసినట్లయితే అక్కడే ఆన్లైన్ ప్రక్రియ ఎటువంటి తప్పులు జరగకుండా చేసుకోవచ్చని కావున వెంటనే కళాశాలను సంప్రదించాలని కోరారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ హెడ్ మాస్టర్ వీరాస్వామి, డాక్టర్ నర్సింహ నాయక్, సోమ్లా నాయక్ విద్యార్థులకు అనేక సూచనలు చేశారు.

Share it:

TS

Post A Comment: