మన్యం టీవీ భుర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం లో గల టి.ఎస్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలను,ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు హాజరు అవుతున్నారని ప్రిన్సిపాల్ ను వివరణ కోరారు.వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాఠశాల ఆవరణలో టాయిలెట్లను పారిశుధ్య కార్మికులచే ప్రతి రోజూ శుభ్రం చేయించాలని, పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. బల్లాలు,మంచినీటి వసతి మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. పాఠశాల ఆవరణలో శిథిలావస్థకు చేరిన భవనాలను పరిశీలించారు.అనంతరం మధ్యాహన భోజనంపై విద్యార్థులను ఆరా తీసి వారితో కలిసి భోజనం చేశారు. టాయిలెట్స్,తాగునీరు,వసతులు,పాఠశాల విద్యార్థులు హాజరు పట్టిక,హాజరు శాతాన్ని ప్రధానోపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న,టిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు గోనెల నాని,టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జక్కం. సుబ్రమణ్యం,స్థానిక సొసైటీ డైరెక్టర్ బొల్లు రవి,స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: