మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను గురువారం నాడు భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోట తిరుపతి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా మణుగూరు పట్టణ కేంద్రానికి రవాణా శాఖ కార్యాలయం మంజూరు కోసం కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ ప్రాంత ప్రజలకి సౌకర్యవంతంగా ఈ కార్యాలయం పనిచేస్తుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఎం.రాజు, మణుగూరు లారీ అసోషియేషన్ సభ్యులు, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: