మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ :
వీఆర్ఎల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చండ్రుగొండ ప్రతిపక్ష మండల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చండ్రుగొండ మండల వీఆర్ఏల దీక్షా శిబిరాలను వారు సందర్శించి, వారికి సంఘీభావం ప్రకటించి, తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష మండల నాయకులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వీఆర్ఎలకు పేస్కేలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం సరైందికాదన్నారు. ముఖ్యమంత్రి హామీ ప్రకారం వీఆర్ఎలకు పేస్కేలు అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఎలకు పదోన్నతి కలిగించాలని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఎల వారసులకు ఉద్యోగ అవకాశం, పెన్షన్ సౌకర్యం కల్పించాలని వీఆర్ఎలు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని, వారి యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఎల డిమాండ్లు న్యాయమైనవి కావున వారి యొక్క పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు బొర్ర సురేష్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముడ్ బాలాజీ నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు రాంబాబు నాయక్, ట్రేడ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్, కన్నయ్య, యువజన కాంగ్రెస్ మండల నాయకులు సున్నం సీతారాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లం కృష్ణయ్య, మండల వీఆర్ఏ సిబ్బంది, వీఆర్ఏ సంఘం జిల్లా కార్యదర్శి చాంద్ మీరా, లక్ష్మీపతి , మౌలానా, రోజా నవీన్, సైదా , జానీమియా, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: