CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పునరావస కేంద్రాన్ని సందర్శించిన జడ్పీ చైర్మన్ కోరం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని.వరద బాధితులకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ....

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

మండంలోని మంగువాయిబడవ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటుచేసిన గోదావరి వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర కార్యదర్శి డా. తెల్లం వెంకట్రావు సందర్శించారు అనంతరం గోదావరి వరదల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయకచర్యలు చేపట్టాలని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధికారులను ఆదేశించారు. వరద బాధిత కుటుంబాలకు ఏర్పాటు చేసిన పునరావాసకేంద్రాన్ని పరిశీలించారు వారితో ముచ్చటించారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. మండల టిఆర్ఎస్ నాయకులు అధికారులు కలిసి భాదితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీఓ ముత్యాలరావు, మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి,కార్యదర్శి కణితి రాముడు, ఎంపీపీ రేసు,లక్ష్మి జడ్పిటిసి తెల్లం సీతమ్మ, ఎంపీటీసీ మడకం రామారావు, సర్పంచ్ జుంజురీ లక్ష్మీ, ఉపాధ్యక్షులు తునీకి కామేశ్వరరావు,శ్రీధర్, అనిల్, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: