- జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి.....
- వరద బాధితులకు లక్ష విలువైన నూతన వస్త్రాల పంపిణీ....
మన్యం మనుగడ, మంగపేట.
వెనుకబడిన మారుమూల పల్లెల్లో లయన్స్ క్లబ్ సేవలను విస్తరిస్తామని హనుమకొండ లయన్స్ ఆత్మీయ క్లబ్ ప్రెసిడెంట్ చల్లా రఘునాథ్ రెడ్డి అన్నారు గురువారం ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో ఇటీవల సంభవించిన గోదావరి వరదల వల్ల నష్టపోయిన ముంపు బాధితులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వరద బాధితులకు అండగా తమ లయన్స్ క్లబ్ ఉంటుందని అన్నారు. గోదావరి వరద వల్ల అకినేపల్లి మల్లారం గ్రామం మునిగిపోయిందనే విషయాన్ని జాతీయ మిర్చి బోర్డ్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి ద్వారా తాము తెలుసుకొని వెంటనే స్పందించి ఈరోజు 200 కుటుంబాలకు రూపాయలు లక్ష విలువైన నూతన వస్త్రాలను పంపిణీ చేసినట్లు తెలిపారు భవిష్యత్తులో కూడా తమ లయన్స్ క్లబ్ సేవలు ఈ గ్రామంలో కొనసాగుతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయమిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబ శివ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని తమ గ్రామంలో కంటిచూపు సమస్యతో బాధపడే వారి కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేయగా లయన్స్ ఆత్మీయ క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య స్థానిక పేద ప్రజలను చూసి చలించి మెడికల్ క్యాంపును వెంటనే మంజూరు చేస్తూ ప్రకటించారు వరద బాధితులకు అండగా నిలబడ్డ లయన్స్ క్లబ్ ని ఈ సందర్భంగా సాంబశివరెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోరిక సునీల్ నాయక్ లయన్స్ క్లబ్ కార్యదర్శి డాక్టర్ తిలక్ కోశాధికారి దీకొండ సమ్మయ్య ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్ర శేఖర్ ఆర్య లయన్స్ క్లబ్ సహాయ కార్యదర్శి డాక్టర్ భయ్యా సామామూర్తి సిహెచ్ శామ్యూల్ మాటూరు పరమేశ్వర్ స్థానికులు లక్కీ వెంకన్న చెట్టుపల్లి తిరుపతిరావు ప్రసాదు గాలి వేణు పిచ్చుకల విజయ్ శ్రీనివాస రెడ్డి వెంకటేశ్వర రెడ్డి రెండు వందల మంది వరద బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: