CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దళితులు ఉపాధి వ్యాపార రంగాలలో ఆర్థికంగా ఎదగాలి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా. కాంతారావు మణుగూరు మండలం పగిడేరు గ్రామానికి చెందిన బేత మల్ల సుందర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో మంజూరైన యూనిట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు లబ్ధిదారుడితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రూపొందించారని,ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా వ్యాపారాల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని ఆయన తెలిపారు.దళితులు ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు దళితులంతా రుణపడి ఉంటారన్నారు.దేశంలోని చాలా రాష్ట్రాలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని అని తెలిపారు.దళిత బంధు పథకంతో అనేక దళిత కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,కార్యదర్శి రవి ప్రసాద్, మండల,పట్టణ యువజన అధ్యక్షులు హర్ష నాయుడు, రుద్ర వెంకట్,పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, టిఆర్ఎస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: