CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విప్లవోద్యమ హిమ శిఖరం కామ్రేడ్ డీవీకే గారి మరణం భారత విప్లవోద్యమానికి తీరని లోటు.సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కామ్రేడ్ నూపా భాస్కర్

Share it:

 


ములకలపల్లి:(జులై04)మన్యం మనుగడ ప్రతినిధి:

సిపిఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామ్రేడ్ డీవీకే అమరత్వాన్ని కొనియాడుతూ ములకలపల్లి మండల కేంద్రంలో ప్రజాపంథా మండల కమిటి ఆద్వర్యంలో ప్రజాపంథా పార్టి మండల కార్యలయంలో సంతాప సభను నిర్వహించారు. ఈసందర్బగా ముందుగ డీవి కృష్ణ చిత్ర పటనికీ పూలు వేసి నివాలర్పించారు.ఈ సభకు మండల కార్యదర్శి కల్లూరి కిషోర్ అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడుతూ భారత నిర్దిష్ట పరిస్థితులను అంచనావేసి ప్రజలు ఎదుర్కొనే సమస్యలను అధ్యయనం చేసి ప్రజలను సమీకరించి ప్రజాయుద్ధ పంథా ను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పం కలిగిన విప్లవ మేధావిని కాలం కాటు వేసిందని ఆయన అన్నారు.కామ్రేడ్ డీవీకే కి విప్లవ నివాళులు అర్పించడం అంటే ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ప్రజా ఉద్యమాల లో అడుగులు వడి వడిగావేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ పార్టి నాయకులు పి లక్ష్మణ్,వై రామారావు,యం పి టీ సీ నూపా సరోజని,రాచన్నగూడెం సర్పంచ్,కొర్సా గణపతి ,కొర్స రామకృష్ణ, వెలకం చలమయ్య, మిడియం నరేష్,కోండ్రు రవి,నకిరకంటి నాగేశ్వరరావ,బండారు నరేందర్,కీసరి గోపాల్ రావు,కుంజా రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: