గుండాల జూలై 26(మన్యం మనుగడ) మండలంలో భారీ వర్షం మంగళవారం కురిసింది భారీ వర్షం దాటికి మండలంలోని వాగులు వంకలు ఉదృతంగా ప్రవహించాయి మండలం పరిధిలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన మంకిడి రమేష్ రైతు తన రెండు దుక్కి తెద్దులని అలుగు ఓర్రె సమీపంలో కట్టేసి సమీపంలో చేను పనులు చేసుకుంటున్నాడు అకస్మాత్తుగా వచ్చిన వరదతో రెండు ఎద్దులు మునిగిపోగా గమనించిన కొందరు ఒకదానిని వరద నుండి తప్పించారు మరొకటి మాత్రం వరదలు మునిగి మృతి చెందింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ వెటర్నరీ అసిస్టెంట్ హరి కిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. అనంతరం రైతు రమేష్ మాట్లాడుతూ సుమారు ఎద్దు 40 వేలు విలువ చేస్తుందని ప్రభుత్వమే తన నాదుకోవాలని విజ్ఞప్తి చేశాడు
Post A Comment: