మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నాడు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు ఆధ్వర్యంలో దివ్యాంగుల మహాసభలకి ఖర్చుల నిమిత్తం మండలం లోని దివ్యాంగులకు ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సౌజన్యంతో రూ.5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జెడ్పిటిసి పోశం నరసింహారావు దివ్యాంగులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,మండల కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ ఏనిక.ప్రసాద్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,నాయకులు రామారావు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: