మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల సరిహద్దు ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాలలో, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, తుఫాను ప్రభావం వల్ల తెలుగు రెండు రాష్ట్రాల్లోని అనేక గ్రామాలు లోతట్టు గ్రామాలు జలమలమయ్యాయి, వేల కుటుంబాల ప్రజలు చిన్న పిల్లలు ఆహారం, నిత్యవసర వస్తువులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు, వారికి సహాయం చేయు నిమిత్తం, అశ్వారావుపేట పట్టణం స్థానిక మిషన్ డైరెక్టర్ స్టీవెన్సన్ దొర, ఆధ్వర్యంలో, వెలేరుపాడు మండలంలోని తుఫాను వరద బాధిత ప్రాంతలైన పడమట మెట్టు, బండ్ల బోరు, కచరాం, కోయిదా లోని వరద బాధిత కుటుంబాలకు వారికి సహాయం నిమిత్తం బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు, పండ్లు పాలు, తదితర వస్తువుల తో నాలుగు వాహనాలలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా డైరెక్టర్ స్టీవెన్ దొర మాట్లాడుతూ యూత్ విత్ మిషన్ ముంబయి వారి సహకారంతో తెలుగు రాష్ట్రలలో పేద ప్రజల సంక్షేమం కొరకు అనేక సేవ కార్యక్రమాలు చేపట్టలని, ప్రణాళికలు చేయు చున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ డైరెక్టర్ స్టీవెన్ దొర, మిషన్ సభ్యులు రోజా కుమారి, ఫిలోమాన్, ఆనంద్, కమల, మంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: