మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల దీక్ష శిబిరాన్ని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీకృష్ణ, చంద్రయ్య, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పూదోట సూరిబాబు వారికి మద్దతి ఇచ్చి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని అర్హత కలిగిన వీఆర్ఏ వారి చేసిన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏ సంఘం మండల అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వం మాకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని మాకు మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపినందుకు వీఆర్ఏ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజేష్ కోశాధికారి నవీన్ సభ్యులు వెంకటలక్ష్మి శాలిని లక్ష్మీ మహేష్ ఈశ్వర్ చంటి సీతారాములు పాల్గొన్నారు.

Post A Comment: