మన్యం టీవీ భుర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతమైన బూర్గంపహాడ్ గ్రామంలోని ముంపునకు గురైన లోతట్టు ప్రాంత ప్రజలను మండల కేంద్రంలో గల కస్తూరిభా గాంధీ పాఠశాలలో పునరావాసం కల్పించి,వారికి భోజన ఏర్పాట్లు చేయించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,అధికార యంత్రాంగం.ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి,ఎంపీడీఓ వివేక్ రాం,ఎంపీఒ సునీల్ కుమార్,ఎస్ఐ జీవన్ రాజు, స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న,పిఆర్ఏఈ వెంకటేశ్వర్లు, ఎలక్ట్రికల్ ఏ ఈ,పంచాయతీ సిబ్బంది,తహసీల్దార్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: