మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా గత రెండు మూడు రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలు జలమయమై, ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఆ ప్రాంతాలలో జోరు వానను సైతం లెక్కచేయకుండా విస్తృతంగా పర్యటిస్తున్నారు. జెసిబి సహాయంతో తానే స్వయంగా దగ్గరుండి సహాయ చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,విరామం లేకుండా వర్షాలు కురుస్తున్నందునా,ప్రజలను అధికారులను అప్రమత్తం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని, అందులో భాగంగానే లోతట్టు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నామని తెలిపారు.ఎలాంటి సమస్య వచ్చిన అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు మూడు రోజుల పాఠశాల ప్రకటించామని,అవసరమైతే తప్ప బయటికి రావద్దు అని సూచించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు,అధికారులు,పంచాయితీ సెక్రెటరీ లు,టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: