జూలూరుపాడు జులై 12, (మన్యం మనుగడ) ప్రతినిధి, మండల పరిధిలోని గిరిజన లంబాడ తండాలలో మంగళవారం బంజారాల ఆరాధ్య దైవమైన సీత్లా భవాని పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏట జులై నెల ఆషాడ మాసం రెండవ మంగళవారం గిరిజన తండాలలో ఈ పండుగ నిర్వహిస్తామని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడాలని, పాడి, పంటలు బాగుండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని సీత్లాల భవానీ మాతను వేడుకుంటామని అన్నారు. డప్పు వాయిద్యాలతో గిరిజన ఆడబిడ్డలందరూ బోనం ఎత్తి అంగరంగ వైభవంగా జరుపుకునే తొలి పండుగ సీత్లా పండుగ అని అన్నారు. గిరిజన లంబాడ సాంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నామని, దీనినే దాటుడు పండుగ అని కూడా అంటారని, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బి దేవీలాల్ నాయక్ మన్యం మనుగడ కి తెలిపారు.
Post A Comment: