మన్యం మనుగడ వెబ్ డెస్క్:
పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 18% జిఎస్టి పెంచడాన్ని నిరసిస్తూ మణుగూరు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం అక్కడినుండి ప్రదర్శనగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్లో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు మాట్లాడుతూ కష్టజీవులైన పాల ఉత్పదారులపై 18 శాతం జీఎస్టీ పెంచడానికి దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు రెక్కల కష్టం చేసుకుని జీవనం సాగించే పాల ఉత్పత్తిదారులపై పెంచిన జీఎస్టీ ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రజలపై పెనుబారాలు మోపుతూ పాలన సాగిస్తుందని ఆయన అన్నారు ఇటీవల కాలంలో పెట్రోల్ గ్యాస్ నిత్యవసర సరుకులు నిత్య కృత్యంగా పెంచుతూ దయలేని పరిపాలన సాగిస్తుందని అన్నారు ప్రజలు మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీపీ కారం విజయ కుమారి టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు ప్రాథమిక పరపతి సంఘం అధ్యక్షులు కురి నాగేశ్వరరావు టిఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్ శ్రీనివాస్ రహీం బాబు జాన్ సాగర్ యాదవ్ సృజన్ యూత్ నాయకులు హర్ష నాయుడు మరియు ఎంపీటీసీలు గాజుల రమ్య సరిత సర్పంచులు ఏనిక ప్రసాద్ బొగ్గం రజిత టిఆర్ఎస్ మహిళా నాయకులు రమాదేవి సుజాత తదితరులు పాల్గొన్నారు
Post A Comment: