మన్యం మనుగడ ,పినపాక:
లోడింగ్ అవకాశం కల్పించి ఇసుక లారీ డ్రైవర్ల బాధలు తీర్చాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి అధికారులను కోరారు. జానంపేట ఇసుక ర్యాంపు కు లోడింగ్ కోసం వచ్చిన లారీ డ్రైవర్ల తో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇసుక లారీ డ్రైవర్లు పలు సమస్యలను ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక డిడిలు తీసుకొని సుమారు వంద పైచిలుకు లారీలు జానంపేట ఇసుక ర్యాంపు కు 2 వారాల క్రితం వచ్చాయని రెండు వారాల నుంచి ఇసుక లోడింగ్ లేకపోవడం వలన రెండు వారాల నుండి లారీ డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్నానాలు చేసుకునే అవకాశం లేక, రాత్రి లారీల లోనే పడుకుంటూ క్రిందకు దిగితే ఏ విషసర్పాలు కాటేస్తయో అని భయపడుతూ, తెచ్చుకున్న డబ్బులు అయిపోయి తిండికి ఇబ్బందులు పడుతూ, ఇంటిదగ్గర పిల్లలను స్కూలుకు పంపే సమయం కావున వారిని పట్టించుకునే అవకాశం లేక, వర్షాలు, వరదల లో రెండు వారాల నుండి కుటుంబాలకు దూరంగా ఉంటూ లారీ డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు తెలియజేసిన స్పందించడం లేదని, అసలు లోడింగ్ అవుతుందా, కాదా అయితే ఎప్పటి వరకు అవుతుంది అనే విషయం కూడా అధికారులు స్పష్టంగా తెలియజేయడం లేదని ఆందోళన చెందుతున్నారని అన్నారు. వర్షాలు, వరదలు తగ్గి ర్యాంపు దగ్గరికి లారీలు కూడా పోయి లోడింగ్ చేసుకునే అవకాశం ఏర్పడింది కావున అధికారులు వెంటనే స్పందించి లోడింగ్ అవకాశం కల్పించి ఇసుక లారీ డ్రైవర్ల బాధలు తీర్చాలని సంబంధిత అధికారులను కోరారు. సంబంధిత అధికారులు స్పందించనట్లయితే మా యూనియన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్ ల తోటి ఆందోళన నిర్వహిస్తామన్నారు.
ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు చెట్టుపల్లి. నాగేశ్వరరావు,లారీ డ్రైవర్లు పాల్గొన్నారు.
Post A Comment: