దమ్మపేట జులై 21 ( మన్యం మనుగడ ) : ఈరోజు కొన్ని వార్తాపత్రికలలో వచ్చిన మందలపల్లి గ్రామ సర్పంచ్ అయిన శ్రీమతి దుర్గ ను ఉపసర్పంచ్ అయిన నేను తీవ్రంగా వేధిస్తున్నాను అని కొన్ని నిరాధారమైన కథనాలను ఖండిస్తూ పూర్తి ఆధారాలతో జరిగిన విషయాలను పంచాయతీ అభివృద్ధిలో భాగంగా చేయవలసిన పనులను చేయకుండానే చేసినట్లు దొంగ బిల్లులు పెడుతూ సంతకం చేయమని ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో గతంలో పలుమార్లు ఎంపీఓ, ఎంపీడీవో, డిపిఓ మరియు కలెక్టర్ లకు ఫిర్యాదులు సర్పంచ్ పై ఇచ్చి ఉన్నాను. ఇలా ప్రశ్నించినందుకు నాపై కులం పేరుతో దూషిస్తున్నానని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు ఇందులో ఎలాంటి నిజం లేదని నాపై వచ్చిన ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా నేను సిద్దమని ఉపసర్పంచ్ గారపాటి సూర్య నారాయణ తెలిపారు.
Navigation
Post A Comment: