దమ్మపేట జులై 21 ( మన్యం మనుగడ ) :గురువారం నాడు మందలపల్లి గ్రామపంచాయతీలో ఆదివాసి జె.ఏ.సి బృందం పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా జె.ఏ.సి అధ్యక్షులు బండారు సూర్యనారాయణ మాట్లాడుతూ మందలపల్లి ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ పంచాయతీ నిధులు పక్కదారి మళ్లించి అవినీతికి పాల్పడినట్లు ఉన్నందున తక్షణమే గారపాటి సూర్యనారాయణ ను ఆ పదవి నుండి సస్పెండ్ చేసి అతనిపై బహిరంగ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆదివాసీ మహిళా సర్పంచ్ ను మానసికంగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడం మానుకోవాలని హెచ్చరించారు. ఆదివాసీ మహిళా సర్పంచ్ ను దుర్భాషలాడి, వేదింపులకు గురి చేసినందుకు సూర్యనారాయణ పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేంత వరకు ఆదివాసీ జేఏసీ తరుపున పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంలో అన్నారు ఈ సమావేశానికి సోయం రామ్మూర్తి , తాటి పోతురాజు వాసం పోలయ్య ,ఆదివాసీ యువ నాయకులు వాడే వీరస్వామి, యాట్ల మంగరావు, యాట్ల శివ, ప్రశాంత్, పర్శిక మారేశ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: