- ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సీతక్క పుట్టినరోజు సందర్బంగా వృద్ధాశ్రమానికి పదివేల రూపాయలు విరాళం
మన్యం మనుగడ, అశ్వారావుపేట: ఆదివాసీ ముద్దు బిడ్డ, ములుగు ఎమ్మెల్యే జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ధనసరి అనసూర్య సీతక్క జన్మదిన వేడుకలను అశ్వారావుపేట పట్టణంలో అమ్మ వృద్ధాశ్రమంలో శనివారం ఎంపీటీసీ వేముల భారతి ప్రతాప్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరై అమ్మ వృద్ధాశ్రమం డైరెక్టర్ అనసూర్యకు వేముల భారతి చేతులు మీదుగా పది వేల రూపాయలు నగదు విరాళం అందజేశారు. అనంతరం వేముల భారతి కేకు కట్ చేసి వృద్ధులకు అన్నదానంతో పాటు చీరలు దుప్పట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వేముల భారతి ప్రతాప్ మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవా చెయ్యడమే దేయంగా ములుగు నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకురాలు ములుగు ఎమ్మెల్యే సీతక్క అని, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సీతక్క ను ఆదర్శంగా తీసుకోని ఎందరో మహానుభావులు మహిళా మణులు కరోనా కష్టకాలంలో సైతం పేదల ఆకలి తీర్చారాని ఆమె నేటితరం మహిళా మణులకు ఆదర్శమని ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు జేష్ఠ సత్యనారాయణ చౌదరి, మాజీ జడ్పీటీసీ అంకత మల్లికార్జున రావు, ముల్లగిరి మోహన్, బద్దె చిట్టయ్య, ఉదయ్, చక్రధర్ రావు పాల్గొన్నారు.
Post A Comment: