CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన ప్రెస్‌ క్లబ్‌ ఎన్నిక.

Share it:

 


మన్యం మనుగడ వాజేడు జూలై 27: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రము లో ఈరోజు నూతన మండల ప్రెస్‌ క్లబ్‌ ఎన్నిక జరిగింది అధ్యక్షునిగా తిప్పనపల్లి రాజు బుధవారం ఏకగ్రీవంగా మండల పాత్రికేయులు ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా తిప్పనపల్లి రాజు (మన తెలంగాణ) కార్యదర్శి సిద్దబోయిన సర్వేశ్వరరావు, (మన్యం మనుగడ) సౌత్ ఇండియన్ న్యూస్, ఉపాధ్యక్షునిగా దాని శెట్టి నాగేంద్రబాబు, (సామాజిక తెలంగాణ), కోశాధికారిగా జె టీవీ సత్యనారాయణ,(10 న్యూస్) సంయుక్త కార్యదర్శిగా కుమార్, ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్‌ క్లబ్‌ నూతన అధ్యక్షుడు తిప్పనపల్లి రాజు మాట్లాడుతూ, ప్రెస్‌ క్లబ్‌ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని విలేకర్లకు సహాయసహకారాలు అందజేస్తానని అన్నారు. అట్లాగే మండలంలోని అన్ని శాఖల అధికారులకు అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండి మండల అభివృద్ధి లో ప్రజలకు తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పూనం సాయి, పాయం అజయ్, టి కిషోర్, సదానందం, లక్ష్మణ్, మోహన్ . తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: