మన్యం టీవీ దుమ్ముగూడెం ::
గోదావరి వరద ముంపు గ్రామాలైన సున్నం బట్టి, ఏం కాశిగానారం గ్రామంలో పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య సిబ్బంది చేస్తున్న ఫీవర్ సర్వే ఐఎస్ఆర్ స్పేయింగ్ కార్యక్రమం భద్రాచలం డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ బాలాజీ నాయక్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య సిబ్బంది అప్రయత్నం ఉండాలని గ్రామాల్లో వ్యాధులు నియంత్రణకు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని మండలంలోని ప్రజలందరూ(18 సంవత్సరాలు నిండిన)కోవిడ్-19 బూస్టర్ టీకాను వేసుకోవాలని తెలిపారు. అలానే పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం భూలక్ష్మి అకాల వర్షాలు వరదలు కారణంగా ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహణలో భాగంగా చింతగుప్ప గ్రామానికి చెందిన ఇద్దరు రోగులు గ్రామ శివారులో పొలం పనిలో ఉన్నారని తెలుసుకొని వారి వద్దకు కాలినడకన వెళ్లి మలేరియా టెస్టులు నిర్వహించి వారికి అవసరమైన మందులు అందించి తగు జాగ్రత్తలు సూచించారు ఈ సందర్భంగా వారి సేవలకు పలువురు అధికారులు రాజకీయ నాయకులు అభినందనలు తెలిపారు
Post A Comment: