మన్యం టివి మణుగూరు:
మణుగూరు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు తమ మానవత్వాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని చిన్న రావిగూడెం,అనంతారం,కమలాపురం,అన్నారం గ్రామాలలో భారీ వర్షాలకు వరదల కారణంగా సర్వం కోల్పోయిన వరద బాధితులకు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు అండగా నిలిచారు.ఈ మేరకు చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వరద బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదగా అందజేయడం బాధితులకు జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పొశం.నర్సింహారావు,మండల ప్రజాప్రతినిధులు,చాంబర్ ఆఫ్ కామర్స్,దొసపాటి నాగేశ్వరరావు,దోసపాటి పిచ్చెశ్వరరావు వెంకటేశ్వర్లు, దుగ్గి సతీష్,చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: