మన్యం మనుగడ, అశ్వారావుపేట:తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అశ్వరావుపేట మండల వీఆర్ఏలు అశ్వరావుపేట మండల తహసిల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అశ్వారావుపేట మండలములోని అన్ని గ్రామాల రైతులకు, విద్యార్థులకు, ప్రజలకు విషియం తెలియాలని 25 వ తేదీ నుండి గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ (గ్రామ సేవకుల) సేవలు నిలిచి వెయ్యడం జరుగుతుందని తెలియజేసారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరే వరకు సమ్మె లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి వారి సమస్య తీరేంతవరకు ప్రజలు సపోర్టు వారికి అందించాలని ప్రతి ఒక్క రైతుసోదరులకు, పెద్దలకు విన్నపం అంటూ స్థానిక వీఆర్ఏలు సమ్మె బాట పట్టారు. వీఆర్ఏల సమ్మె కారణంగా రైతులు ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉండడంతో ప్రభుత్వం వారి విషయంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తుందో, నెరవేరుస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: