దమ్మపేట జూన్ 09 ( మన్యం మనుగడ ) : వైఎస్సార్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా సోయం వీరభద్రం ఎంపికైనారు ఈ మేరకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి వైయస్ షర్మిలమ్మ ఆదేశాలు జారీ చేశారు. మొదటినుంచి అభిమానిగా వైయస్సార్ పాదయాత్ర స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి జమేదార్ బంజర (కాంగ్రెస్ పార్టీ) ఎంపీటీసీగా గెలుపొంది వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన వెంటనే ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో అభిమానిగా ఉంటున్న ఒక ఆదివాసి నాయకుడైనా వీరభద్రంకు మొదటగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కో కన్వీనర్ గా అశ్వరావుపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఆదివాసి రాష్ట్ర విభాగం అధ్యక్షులు గా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు శ్రీమతి వైయస్ షర్మిలమ్మ కు వీరభద్రం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవితో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకుల నియోజకవర్గ కోఆర్డినేటర్లు మండల అధ్యక్షులు మరియు అనుబంధ సంఘాల సూచనలతో సమన్వయం చేస్తూ పార్టీని ప్రజలకు చేరువ చేస్తూ ముందుకు తీసుకువెళతాను అని
సోయం వీరభద్రం తెలిపారు.
Post A Comment: