CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి.వ్యాధులు అరికట్టుటకు తగు చర్యలు తీసుకోవాలి: జడ్పీటీసీ పొశం. నర్సింహారావు

Share it:


మన్యం టీవీ మణుగూరు:


ప్రతిఒక్కరు పరిశుభ్రతను పాటించాలి, సీజనల్ వ్యాధులను అరికట్టాలి అని జడ్పీటీసీ పొశం.నర్సింహారావు తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు ఎంపిడివో కార్యాలయం లో బుధవారం మధ్యాహ్నం వర్షా కాలం లో వచ్చే సిజనల్ వ్యాధులు రాకుండా అరికట్టుటకు తీసుకోవలిసిన జాగ్రత్తలు గురించి,కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పీటీసీ పొశం.నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతిఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేల అధికారులందరు గ్రామాలలో తిరుగుతూ, ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు. ఇంటిచుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రమైన మంచినీటిని వేడిచేసి వడపోసి తాగాలని,ఇంట్లో మరియు పరిసరాల్లో కూలర్స్, రోకళ్ళు,పాత టైర్లు,పాడుబడ్డ గోడలలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో కె.వీరబాబు,ఎంపీవో పి. వెంకటేశ్వర రావు,వైద్యాధికారి పావని రెడ్డి,ఇతర వైద్య సిబ్బంది మరియు 14 గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: