మన్యం టీవీ దుమ్ముగూడెం ::
ఆదివాసుల పై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఏవిఎస్పి డివిజన్ అధ్యక్షులు మల్లు దొర మాట్లాడుతూ సీతానగరం గ్రామంలో 20 సర్వే నంబరు గల భూమి పై ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమం చేసి ప్రభుత్వ భూములను గుర్తించి ఆధారాల ప్రకారం ఆదివాసి జెండాలు వేయడం జరిగిందని భూమిపై మీకు ఎటువంటి హక్కు లేదని చెప్పేసి పోలీసు వారు తమపై కేసులు నమోదు చేశారని అని వాపోయారు ఆదివాసుల చెందాల్సిన హక్కుల కొరకు ఉద్యమాలు చేసే మాపై కేసులు పెట్టడం సబబు కాదని విమర్శించారు. 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులకు ఏజెన్సీ ఈ ప్రాంతంలో వలసవచ్చి బ్రతుకు తున్న గిరిజనేతరులు మాపై దౌర్జన్యంగా కేసులు వేయడం అనేది అధికారుల ప్రోత్సాహంతోనే అని ఆగ్రహం చెందారు.2017, 18 సంవత్సరాల దాకా ప్రభుత్వ భూమి మీద ఉన్న 20 నెంబర్ సర్వే గల భూమి ఇప్పుడు వేరే వారికి పట్టా ఎలా అయిందని అధికారులు ప్రశ్నించారు. మాకు ఉన్న ఆధారాల ప్రకారం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెల్లం హరికృష్ణ, తెల్లం బీమారాజు, పోడియం వెంకటరామన, వాగే రాజేశ్వరి, పూనెం సురేష్, తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: