CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.మన ఊరు మనబడి కార్యక్రమం లో పాల్గొనీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని జగ్గారం గ్రామపంచాయతీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు మన ఊరు మన బడి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నుంచి మంజూరైన 10లక్షల రూపాయలు, అశ్వాపురం మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రభుత్వం నుంచి మంజూరైన 17 లక్షల 52 వేల రూపాయలు, అదేవిధంగా అశ్వాపురం మండలం లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల 12 లక్షలు రూపాయలు, అశ్వాపురం మండలం లోని సీతారాంపురం గ్రామపంచాయతీలో మండల పరిషత్ ఉన్నత పాఠశాల 10 లక్షల రూపాయలు, అశ్వాపురం మండలం లోని మొండికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 29 లక్షల రూపాయలు, అశ్వాపురం మండలం లోని మల్లెల మడుగు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 23 లక్షల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులతో, కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు రూ.7,289 కోట్ల రూపాయలు కేటాయించిందని, ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి వాటి స్థానంలో కొత్త గదులు నిర్మించడం, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాల్ , నిర్మాణాలు చేపట్టడం, త్రాగునీటి సౌకర్యం , విద్యుత్ మరుగుదొడ్లు, భవనాల కు రంగులు వేయడం మరమ్మతులు చేయడం కావలసిన ఫర్నిచర్ ఏర్పాటు చేయటం, చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తున్నదని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేసి పిల్లలకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్, జెడ్పిటిసి సుధీరెడ్డి సులక్షణ గోపిరెడ్డి, ఎంపీపీ ముత్తినేని సుజాత, వైస్ ఎంపీపీ కంచు గట్ల వీరభద్రం, పినపాక నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు విన్న అశోక్ కుమార్, యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ, పినపాక నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకల రమేష్, నియోజకవర్గ యువజనప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ, తాసిల్దార్ సురేష్ కుమార్, ఎం ఈ ఓ వీరస్వామి, ఎంపీడీవో, ఎం పీ ఓ, ఎంపీటీసీలు, స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ నెంబర్లు, ఎస్ఎంసి చైర్మన్లు,మండల నాయకులు, యువజన నాయకులు,ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: