- రూ.15 లక్షల రూపాయల విలువైన గుట్కా నిల్వలు స్వాధీనం
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో నమ్మదగిన సమాచారం మేరకు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మణుగూరు సీఐ ముత్యం రమేష్,మణుగూరు ఎస్ ఐ ఈ.రాజుకుమార్ మరియు సిబ్బంది,లక్ష్మి నారాయణ, రామకృష్ణ,రవిందర్ మరియు బాస్కర్ లు కలసి మణుగూరు పట్టణంలో రాజీవ్ గాంధీ నగర్ ప్రదేశాలలో తనిఖీ నిర్వహించగా తెలంగాణ ప్రభుత్వంచే నిషేధింపబడిన 29 పెద్ద గుట్కా బ్యాగులు, మరియు నాలుగు బస్తాల అంబార్ ప్యాకెట్లు పట్టుకోవడం జరిగింది అని సిఐ ముత్యం రమేష్ తెలిపారు.వాటి విలువ సుమారు 19 లక్షల 40 వేల రూపాయలు ఉంటుంది అన్నారు.ఈ నిషేధిత గుట్కాలను షేక్ తజోద్దిన్ తండ్రి మిరాసయాబ్,వయసు 27, ముస్లిం,మణుగూరు అనే అతను కర్ణాటక రాష్ట్రము బీదర్ నుండి తీసుకుని వచ్చి,మణుగూరు చుట్టు ప్రక్కల ప్రాంతాలలోని షాపుల్లో సరఫరా చేసుటకు రాజీవ్ గాంధీ నగర్ లోని తన ఇంటివద్ద మరియు గ్రేస్ మిషన్ స్కూల్ వెనకలో వాగుమల్లారం లోని బాబాయ్ ఇంటివద్ద నిలువ వుంచగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నారు.అతని పై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు పంపడం జరిగింది అని తెలిపారు.
Post A Comment: