మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తెరాస పార్టీ కార్యాలయంలో యూత్ సమావేశంలో యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో యువత కీలక పాత్ర పోషించాలి, పినపాక నియోజకవర్గాన్ని దిన దిన అభివృద్ధి చేయడంలో రేగా కాంతారావు ప్రముఖ పాత్ర వహిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా అహర్నిశలు కష్టపడుతూ ప్రజల పక్షాన ఉంటూ నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని తక్షణమే సమస్యలకు పరిష్కారం చూపుతూ యువతకు మార్గదర్శకంగా ఉంటూ అనేక పేద విద్యార్థులకు ఉద్యోగ-విద్య-ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నిరు పేద ప్రజలకు ఆర్ధికంగా రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటికి పెద్ద కొడుకులా వృద్దులకు కంటి ఆపరేషన్స్ చేయిస్తూ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు పొందుతున్న ప్రజానేత రేగా కాంతారావు మంత్రిగా చూడటంలో యువత కీలక పాత్ర పోషిస్తూ ముందు వరుసలో ఉండాలని, అలాగే కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని అశ్వాపురం తెరాస మండల యువజన అధ్యక్షులు గద్దల రామకృష్ణ పార్టీ కార్యాలయంలో జరిగిన యూత్ సమావేశలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రచార కార్యదర్శి గడకారి రామకృష్ణ,మండల యువజన ప్రచార కార్యదర్శి జూపల్లి కిరణ్,మండల యువజన ఉపాధ్యక్షులు యాగంటి వెంకటేశ్వర్లు,యూత్ సహాయ కార్యదర్శి మోదుగు వంశీ,కార్యవర్గ సభ్యులు కసిపోగు ప్రవీణ్,బెజవాడ వెంకట్,ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: