CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో ఆదివారం పర్యావరణ దినోత్సవం సందర్బంగా జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల లో హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు పరివర్తన్ కార్యక్రమం లో భాగంగా వృత్తి స్వచ్ఛందా సంస్థ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కలిసి పర్యావరణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాటిల్ ప్రశాంత్ బాజీరావు ఐ ఎఫ్ ఎస్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ డివిజన్ పాల్గొన్నారు. ఏటూరునాగారం నార్త్ రేంజ్, మరియు మంగపేట రేంజ్ ఆఫీసర్స్ బాల రాజు, షకీల్ పాషా,డి ఆర్ వో అరుణ,ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

తిమ్మంపేట స్కూల్ మానేజ్మెంట్ చైర్మన్ చెన్నపల్లి రాంబాబు, గ్రామ పెద్ద పూజారి సురేందర్, పంచాయతీ సెక్రటరీ దేవిప్రియ, స్కూల్ హెడ్ మాస్టర్ రవికుమార్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.ఈ కార్యక్రమం సందర్బంగా హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వారు ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభించారు.స్పోర్ట్స్ కిట్స్ పిల్లలు కు అందజేశారు.

ఈ కార్యక్రమం లో పిల్లల తో కలిసి ర్యాలీ పాల్గొన్నారు. స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. కిచెన్ గార్డెన్ ప్రారంభించారు.పిల్లలు కు పర్యావరణ మీద వ్యాస రచన మరియు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందచేయడం జరిగింది.

ఈ కార్యక్రమం వృత్తి స్వచ్చంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కిషోర్ కుమార్,వారి బృందం గ్రామ కోఆర్డినేటర్ గుండు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: