మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలంలో 4 నెల నుండి పెండింగ్లో ఉన్న ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది మరొక పాడు ఎలమంచిలి సీతారామయ్య భవన్లో జరిగిన సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రవికుమార్ మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు డబ్బులు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని వారు విమర్శించారు అదేవిధంగా తరతరాలుగా సాగుచేస్తున్న పొడుము లకు హక్కు పత్రాలు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 6 నుండి డిసెంబర్ 6 వరకు దరఖాస్తులు తీసుకొని పత్రాలు ఇస్తామని ఇంతవరకు జాడలేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఆదివాసీలు అందరు ఐక్యం చేసి పోరాటాలకు సిద్ధం చేస్తామని వారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు గత మూడు సంవత్సరాల నుండి అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరు కు పెన్షన్ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఇదేనా బంగారు తెలంగాణ అని ఎద్దేవా చేశారు ఇంటి స్థలం ఉన్న ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని రైతుబంధు డబ్బులు వెంటనే వేయాలని లేదంటే భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య,యలమంచి వంశీ క్రిష్ణ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చిలకమ్మా, మర్మం చంద్రయ్య, రాజమ్మ, ఎలమంచి శ్రీను, మర్మం సమ్మక్క, కొడాలి లోకేష్ బాబు, వాగే ఖాదర్ బాబు, సరియం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: