మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామంలోని మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన ఊరు- మన బడి పేరుతో జరుగుతున్న అభివృద్ధి పనులను తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి లు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను పిలిపించి, పకడ్బందీగా అభివృద్ధి పనులను చేయాలని, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా, ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశపెట్టబోయే బోధనకు ఎక్కువ సంఖ్యలో పాఠశాలలో విద్యార్థులు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియపరిచారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తెలంగాణ ప్రభుత్వం సర్కారు పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు సకల చర్యలు తీసుకున్నదని, అధికారులు కట్టుదిట్టమైన చర్యలు, సర్కారు బడుల్లో హాజరు శాతం పెంచే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: