మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని యువతను క్రీడల దిశగా ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలనాధికారి దురిశెట్టి అనుదీప్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్న విధంగా తెలంగాణ గ్రామాల్లో ఉన్న యువత క్రీడల రంగంలో ప్రత్యేకత కనబరచాలని, దేశానికి , రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా క్రీడలపై మక్కువ పెంచుకోవాలని తెలియజేశారు. క్రీడా ప్రాంగణానికి కి సంబంధించి అన్ని రకాల వసతులు అందుబాటులోకి వస్తాయని, ప్రతి ఒక్క గ్రామీణ యువత వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ తో పాటు, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అభిమానులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: